స్టార్ హీరో, టాప్ నిర్మాతపై చీటింగ్ కేసు

ఒకే రోజు ఇద్దరు సినీ ప్రముఖులపై చీటింగ్ కేసు నమోదైంది. కోలీవుడ్ స్టార్ హీరో శ్రీలంకకు చెందిన యువతి చీటింగ్ కేసు పెట్టింది. ‌కరోనా లాక్‌డౌన్‌తో క‌ష్టాల్లో ఉన్నాన‌ని చెప్పి.. ఆర్య త‌న ద‌గ్గ‌ర నుంచి రూ. 70 ల‌క్ష‌లు తీసుకున్నాడ‌ ఆరోపించింది. అంతేకాదు.. తన‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మాట ఇచ్చి.. మోసం చేశాడని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెబుతోంది.

మరోవైపు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆనంద్ ప్రసాద్ పై చీటింగ్ కేసు నమోదైంది. తన నుంచి రూ.1 కోటి రుణంగా తీసుకున్నారని, కానీ ఇంతవరకు తీర్చలేదని సత్యనారాయణ అనే వ్యక్తి ఆనంద ప్రసాద్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆనంద ప్రసాద్ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులపైనా చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద ప్రసాద్.. బాలయ్యతో పైసా వసూల్, నితిన్ తో చెక్, గోపీచంద్ తో వాంటెడ్, లౌక్యం, శౌర్యం వంటి చిత్రాలను నిర్మించారు.