కీర్తి సురేష్.. కిర్రాక్ పోజు !

‘నేను శైలజ’తో తెలుగు తెరకు పరిచయం అయింది కీర్తి సురేష్. ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ కొన్ని హిట్స్ కొట్టింది. ‘నేను లోకల్’తో మళ్లీ తెలుగులో హిట్ అందుకుంది. ఇక ‘మహానటి’ బయోపిక్ తో స్టార్ హీరోయిన్ అంతకుమించి అనిపించుకుంది. ఆ తర్వాత కథల ఎంపికలో తడబడింది. దీంతో ఆమెకు విజయాలు దక్కలేదు. అయితే ‘రంగ్ దే’తో మరోసారి నటనతో ఆకట్టుకుంది. విజయాన్ని అందుకుంది. రంగ్ దే హిట్ కిక్కులో ఉన్న.. కీర్తి తాజాగా హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది. 

శారీలో కిర్రాక్ పోజులిచ్చింది. ఆ ఫోటోలని స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. సన్నబడినా తనలో ఏమాత్రం అందాలు తగ్గలేదని కీర్తి పోజులిచ్చినట్టు ఉన్నాయ్.. ఆ ఫోటోలు. ప్రస్తుతం కీర్తి మహెష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. మహేష్ తో కీర్తి నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో నటించమని స్వయంగా మహేష్ బాబు ఫోన్ చేసి కీర్తిని అడిగారట.