ముంబై ఇండియన్స్ జెర్సీ.. క్యాప్షన్ మారాయ్ !

మరో రెండు వారాల్లో ఐపీఎల్ పండగ మొదలుకాబోతుంది. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ సీజన్ 14 ప్రాంరంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్లని కొత్త ఉత్సాహంతో రెడీ అవుతున్నాయ్. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ సరికొత్త జెర్సీ రెడీ అయింది. తాజాగా ముంబై ఇండియన్స్ కూడా సరికొత్త జెర్సీని విడుదల చేసింది. జెర్సీ రంగు, డిజైన్ లో కొన్ని మార్పులు చేసింది. 

గత ఏడాది కొంచెం ముదురు నీలి రంగు జెర్సీల్లో మెరిసిపోయిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు.. ఇప్పుడు కొంచెం లేత నీలి రంగు జెర్సీల్లో ఆడబోతున్నారు. కొత్త జెర్సీకి సంబంధించిన వివరాలను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ట్విట్టర్ లో వెల్లడించింది. ‘ఒక టీం.. ఒక కుటుంబం.. ఒక జెర్సీ’ అన్న క్యాప్షన్ తో జెర్సీని విడుదల చేసింది. కావాల్సిన వాళ్లు ముందే ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చని సూచించింది.

అత్యధిక సార్లు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2013, 2015, 2017, 2019, 2020లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ టైటిళ్లు సాధించింది. ఈ యేడాది కూడా టైటిల్ ని గెలిస్తే.. ముంబై ఖాతాలో హ్యాట్రిక్ నమోదు కానుంది.