కోహ్లీ.. నో రెస్ట్ !

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ విషయంలో ఎంత పట్టుదలగా ఉంత్టాడో తెలిసిందే. ఇంగ్లాండ్‌తో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ మ్యాచ్‌లు అయిపోయాయి. ఇప్పుడు ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరికింది. ఐతే కోహ్లీ మాత్రం రెస్ట్ తీసుకోవడం లేదు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ కోసం చెమటోడుస్తున్నాడు.

తాజాగా ట్రేడ్‌మిల్‌పై పరుగులు తీస్తున్న వీడియోను కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను విశ్రాంతి తీసుకోనని, ఇకపై ఐపీఎల్‌ కోసం పరుగెత్తాలని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. కాగా కోహ్లీ పోస్టు చేసిన వీడియోకు తన సహచర ఆటగాడు ఏబీడివిలియర్స్‌ స్పందించాడు. తాను కూడా మెగా ఈవెంట్‌ కోసం సిద్ధమయ్యానని లగేజ్‌ సర్దుకున్న ఫొటోను రీట్వీట్‌ చేశాడు. ఇప్పటివరకు ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌ సాధించలేదు. ఈ సారైనా.. ఆ కోరిక తీర్చుకోవాలని ఆశపడుతోంది.