కరోనా వాక్సీన్ తీసుకున్న సీఎం జగన్ దంపతులు

ఏపీ సచివాలయంలో సచివాలయాల్లో కరోనా వాక్సినేషన్ ప్రారంభం అయింది. తొలి డోస్ ని సీఎం జగన్ దంపతులు తీసుకున్నారు. హాయిగా నవ్వుతూ వాక్సినేషన్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కరోనా వాక్సిన్ తీసుకోవాలి. మన శాస్ట్రవేత్తలు ఎంతో కష్టపడి, శ్రమకోర్చి ఈ వాక్సిన్ తీసుకొచ్చారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని సీఎం జగన్ కోరుతున్నారు. 


దేశ వ్యాప్తంగా ఈరోజు నుంచి 45 యేళ్లు దాటిన వారికి కరోనా వాక్సిన్ ఇస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. తెలంగాణలో ప్రతిరోజూ లక్ష మందికి కరోనా వాక్సిన్ ఇస్తున్నారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలని తాత్కాలికంగా మూసేసిన సంగతి తెలిసిందే.