టైగర్ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్

టైగర్‌ ష్రాఫ్‌ – హృతిక్‌ రోషన్‌ కలిసి నటించిన ‘వార్‌’. సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘వార్’ బ్లాక్ బస్టర్ హిట్టైంది. ముఖ్యంగా యాక్షన్ ప్రియులకి విందు భోజనం పెట్టింది. ఈ సినిమా తర్వాత టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడిగా ‘రాంబో’ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు సిద్ధార్థ్ ఆనంద్. టైటిల్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఈ సినిమా అప్ డేటు రాలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయినట్టే అనుకున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ తెలిసింది. రాంబో కోసం టైగర్‌ కాల్షీట్స్ ని సర్దుబాటు చేయడం లేదట. దాంతో ‘బాహుబలి’ నటుడు ప్రభాస్‌ని ‘రాంబో’ సినిమా కోసం దర్శకుడు సిద్ధార్థ్ సంప్రదించాడట. కథతో పాటు వారు చెప్పిన కాన్సెప్ట్ ప్రభాస్‌కి నచ్చిందట. ప్రభాస్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే.. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావొచ్చని చెబుతున్నారు.