సోరంగంలో పట్టాలు తప్పిన రైలు.. భారీగా ప్రాణ నష్టం !

తైవాన్ లో దారుణం చోటు చేసుకుంది. తూర్పు తైవాన్ లో  సోరంగంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు చనిపోయినట్లు సమాచారమ్.  మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య 36 వరకు ఉండవచ్చని చెబుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

 ఈ రైలులో మొత్తం 350 మంది ఉన్నారు. రైలు సగభాగం సొరంగంలోకి వెళ్లాక పట్టాలు తప్పడంతో లోపలికి చేరుకోవడం సహాయక బృందాలకు కష్టతరంగా మారింది. సొరంగంలో దాదాపు 70 మంది చిక్కుపోయారని అధికారులు చెబుతున్నారు.