‘మేజర్’ టీనేజ్ లవ్ స్టోరీ

అడివి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం ‘మేజర్’. ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గూఢచారి ఫేం శశికిరణ టిక్కా దర్శకుడు. శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా సాయి ఎం మంజ్రేకర్ నటిస్తున్నారు. టీనేజ్ లో మేజర్ తో లవ్ పడిన పాత్రలో ఆమె నటిస్తున్నారు. తాజాగా ఆమె పాత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.


క్లాస్ రూమ్ లో సందీప్ కు లవ్ లెటర్ ఇస్తున్న పోస్టర్ ని విడుదల చేశారు. పోస్టర్ సూపర్భ్ గా ఉంది. ఈ నెల 12న ఫస్ట్ టీజర్ ని విడుదల చేయనున్నట్టు పోస్టర్ లో తెలిపారు. ఈ సినిమా కోసం అడవి శేష్ కొన్నాళ్లు రిసెర్చ్ చేశారు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కుటుంబంలో ప్రయాణం చేశారు. సందీప్ బాల్యం, ప్రేమ, కెరీర్.. ఇలా అన్నింటిపై అవగాహన పెంచుకున్నారు. కథా రచనలోనూ అడవిశేష్ ప్రమేయం ఉంది. ఇలా అన్ని పక్కాగా చేసుకున్న తర్వాత సినిమాని మొదలెట్టారు. దీంతో అవుట్ పుట్ అద్భుతం వస్తోంది. మేజర్ సూపర్ హిట్ గ్యారెంటీ అని చెబుతున్నారు.