మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ కి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులు, సెలబ్రెటీలు కరోనా బారినపడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ అక్షయ్ కుమార్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హోం అసోలేషన్ లో ఉన్న అక్షయ్.. తాజాగా ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అక్షయ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ కూడా కరోనా బారినపడ్డారు.

స్టార్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ #BhumiPednekar కరోనా బారినపడ్డారు. గతంలోనూ బాలీవుడ్ సెలబ్రెటీలు, సెలబ్రెటీల కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. కోలుకున్నారు. అయితే ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ఈ నేపథ్యంలో మరోసారి రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. మరోవైపు దేశంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.