TSలో 1500 కేసులు.. 6 మరణాలు !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాదాపు లక్ష కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 96,982 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 446 మంది కరోనాకి బలయ్యారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,29,12,090కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,65,547కి చేరింది.

ఇక తెలంగాణలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,498 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ఆరుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,729కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2452 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,013కి చేరింది. ప్రస్తుతం 9,993 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,323 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.