1,15,736 కొత్త కేసులు.. 630 మరణాలు !

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 1,15,736 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 630 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,43,473(6.21శాతం) మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఇక, కొవిడ్‌బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య మెరుగ్గానే ఉంటుంది. నిన్నఒక్కరోజే 59,856 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1,17,92,135 మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 92.48 శాతానికి పడిపోయింది.

ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,914 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,734కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 285 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,299కి చేరింది. ప్రస్తుతం 11,617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.