ఐపీఎల్ : మరో ఆటగాడికి కరోనా పాజిటివ్

ఐపీఎల్ 14 ను కరోనా వెంటాడుతోంది.  మెగా టోర్నీ ప్రారంభానికి మరో రెండ్రోజుల సమయమే ఉంది. ఇప్పటికే ఇతర జట్ల ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. అక్షర్ పటేల్, దేవదత్ పడిక్కల్, నితీష్ రాణె లకు కరోనా సోకింది. వీరిలో పడిక్కల్ ఇప్పటికే కోలుకున్నారు. తిరిగి జట్టులో చేరారు. తాజాగా మరో ఆటగాడికి కరోనా సోకింది. ఆల్‌రౌండర్‌ డేనియెల్‌ సామ్స్‌కు పాజిటివ్‌ అని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తెలిపింది.

ఆస్ట్రేలియా ఆటగాడైనా డేనియెల్‌ సామ్స్‌ ఏప్రిల్‌ 3న నెగెటివ్‌ రిపోర్టుతో బెంగళూరు శిబిరానికి చేరుకున్నాడు. అతడికి చేసిన రెండో పరీక్షలో పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. వెంటనే బీసీసీఐ కొవిడ్‌-19 నిబంధనల ప్రకారం అతడిని ఐసోలేషన్‌కు పంపించామని ఆర్‌సీబీ తెలియజేసింది. కఠినమైన ఆంక్షలను పాటిస్తున్నామని స్పష్టం చేసింది.