జగన్ విష్ణువు.. చంద్రబాబు రియాక్షన్ !

ఏపీ సీఎం జగన్ ను తితిదే ప్రధానార్చకులు రమణ దీక్షితులు విష్ణుమూర్తితో పోల్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో చంద్రబాబు తిరుమ శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబుతో పాటు..  అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. 

దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. “రాష్ట్రానికి ఉన్న పెద్ద ఆస్తి శ్రీవారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గతంలో శ్రీవారి పింక్‌ డైమండ్‌ పోయిందంటూ ఆరోపణలు చేసిన వ్యక్తిని తిరిగి చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదు. మనిషిని దేవుడితో పోల్చడం సరికాదు. ఇలాంటి అపచారాలు గతంలో కూడా చేశారు” అని అన్నారు.