అఫిషియల్ : ‘లవ్ స్టోరీ’ రిలీజ్ వాయిదా

ఊహించినదే జరిగింది. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 16 తర్వాత రిలీజ్ కాబోతున్న సినిమాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. ఇప్పుడీ.. ఈ వార్తలు నిజం అవుతున్నాయి. ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 

ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. లవ్ స్టోరీ కొత్త రిలీజ్ డేటుని త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. ‘ఫిదా’ సినిమా తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన సినిమా ఇది. ఇందులో నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించారు. ఇప్పటికే రిలీజైన లవ్ స్టోరీ ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయ్. శేఖర్ కమ్ముల  మరోసారి ప్రేక్షకులని ఫిదా చేయనున్నాడనే హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు లవ్ స్టోరీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో లవ్ స్టోరీపై కరోనా కాటు పడింది.