కరోనా కొత్త రికార్డులు

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో లక్షకు పైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,26,789 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. నిన్న కరోనాతో 685 మంది మృతి చెందారు. దీంతో  మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,66,862కి చేరాయి. నిన్న 59,258 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1.18కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 92.11శాతానికి పడిపోయింది.  


ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,055 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,741కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 303 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,601కి చేరింది. ప్రస్తుతం 13,362 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.