దిల్ రాజుకు కరోనా పాజిటివ్

టాలీవుడ్ ని కరోనా వణికిస్తోంది. సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా కలవరంతో క్వారంటైన్ లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన వ్యక్తిగత, సహాయక, భద్రత సిబ్బందిలోని కొందరు కరోనా బారినపడటంతో.. క్వారంటైన్ లోకి వెళ్లారు.

తాజాగా నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజునే తెలిపారు. అంతేకాదు.. ఇటీవల తాను కలిసిన, తనని కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూంచించారు.

వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న దిల్ రాజు.. ఇటీవల కలియ తిరిగారు. చిత్రబృందంతో కలిసి థియేటర్స్ ని సందర్శించారు. పలు ప్రెస్ మీట్స్ నిర్వహించారు. అంతేకాదు.. దర్శకుడు వేణు శ్రీరామ్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. దీంతో.. దిల్ రాజు కారణంగా ఎంతమందికి కరోనా అంటింది అన్నది ఇప్పుడు భయాన్ని కలిగిస్తోంది. దర్శకుడు వేణు శ్రీరామ్, వకీల్ సాబ్ నటీనటుల్లోనూ చాలా మంది కరోనా పాజిటివ్ గా వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు.