దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మరణాలు !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజూవారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,68,912 కొత్త కేసులు.. 904 మరణాలు సంభవించాయి.

కరోనా విజృంభణ తీవ్రంగా ఉండటంతో..బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొత్తంగా వైరస్ బారిన పడినవారి సంఖ్య కోటీ 35లక్షలకు చేరగా..లక్షా 70వేలకు పైగా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 12,01,009కి చేరాయి. పాజిటివ్ కేసుల్లో ఆ వాటా 8.29 శాతానికి చేరింది. ఇక, నిన్న 75,086 మంది కోలుకున్నారు. మొత్తంగా కోటీ 20లక్షల మందికిపైగా కొవిడ్‌ను జయించగా.. ఆ రేటు 90.44 శాతంగా ఉంది.