ధోని అసలు వారసుడు ఎవరు.. తేలేది నేడే !

ఐపీఎల్ లో ధోని వారసుల ఫైట్ జరగనుంది. మహేంద్ర సింగ్ ధోని వారసుడు ఎవరు ? అనే చర్చ మొదలైనప్పుడు.. మొదట తెరమీదకు వచ్చిన పేరు రిషబ్ పంత్. అందుకే అతడిని టీమిండియాలోకి తీసుకున్నారు. చాలానే అవకాశాలు కూడా  ఇచ్చారు. కానీ వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో పంత్ విఫలమయ్యాడు. దీంతో.. అతడిపై విమర్శలొచ్చాయ్. అదే సమయంలో బాగా ఆడుతున్న సంజూ శాంసన్ పై అందరి కన్ను పడింది. అరె.. పంత్ ప్లేసులో సంజూని తీసుకోవచ్చు కదా ? అనే చర్చ మొదలైంది. 


సంజూని పక్కనపెట్టినప్పుడల్లా.. అతడిని తొక్కేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా మారింది. అయితే ఇప్పుడు పంత్, సంజూ ఇద్దరు ప్రత్యర్థులుగా మారారు. అది కూడా క్యాపెన్సీ పోస్టులో. తాజా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా.. రాజస్థాన్ రాయల్స్ కి సంజూ శాంసన్ కెప్టెన్ అయ్యాడు. ఇద్దరికి కెప్టెన్సీ కొత్తే. ఈ సీజన్ లోనే కెప్టెన్స్ ప్రమోషన్స్ పొందారు. కెప్టెన్ హోదాలో ఈరోజు వీరిద్దరు ఢీకొననున్నారు. మరికాసేపట్లో ఐపీఎల్ లో 7వ మ్యాచ్ ఢిల్లీ-రాజస్థాన్ జట్ల మధ్య ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో గెలిచిన వారినే ధోని అసలు వారసుడిగా ప్రకటించాలని సోషల్ మీడియాలో సరదాగా చర్చించుకుంటున్నారు నెటిజన్స్. మరీ.. నిజంగా ధోని అసలుసిసలు వారసుడు ఎవరు అనిపించుకుంటారో.. చూడాలి.. !