TSలో 3,840 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 3,840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  మరో 9 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,797కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1198 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,09,594కి చేరింది. 

ప్రస్తుతం 30,494 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 20,215 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 505 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకి కరోనా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తుండటంతో.. ఆందోళన మొదలైంది. కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకోవాలనే విజ్ఝప్తులు కూడా వస్తున్నాయి.