మోరిస్ మోత.. రాజస్థాన్ విన్ !

ఐపీఎల్ 14లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 148 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన రాజస్థాన్ 42కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నిలకడతో డేవిడ్‌ మిల్లర్ (62; 43 బంతుల్లో 7×4, 2×6)‌.. మెరుపులతో క్రిస్‌ మోరిస్‌ (36*; 18 బంతుల్లో 4×6) ఆదుకున్నారు. 18 బంతుల్లో 34 పరుగులు అవసరమైన టైమ్ లో మోరీస్.. రబాడ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. ఆఖరి 6 బంతుల్లో 12 పరుగులు అవసరమైనప్పుడు మరో రెండు సిక్సర్లు బాది విజయం అందించాడు.  


అంతకు ముందు పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్ (3/15)‌ టాప్‌ ఆర్డర్‌ను కుదేలు చేసి దిల్లీని కట్టడి చేశాడు.  వరుసగా పృథ్వీ షా (2), శిఖర్ ధావన్‌ (9), అజింక్య రహానె (8)ని పెవిలియన్‌ పంపించి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.