చరణ్ సినిమాలో రస్మిక పాత్ర ఇదే !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో #RC15 ఉండనుంది. రాజకీయ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కనుందని రామ్‌చరణ్‌ ఇందులో ముఖ్యమంత్రిగా కనిపించనున్నారని ముమ్మరంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో కథానాయకిగా రష్మిక మందనని తీసుకోనున్నారు. ఇప్పటికే దర్శకుడు శంకర్ రస్మికని కలిసి కథని వినిపించారు. ఆమె ఓకే చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు.. ఇందులో రస్మిక ఇందులో జర్నలిస్టుగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. #RC15 జులై 15న సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’, హీరో శర్వానంద్‌తో కలిసి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో నాయికగా నటిస్తోంది. ఇక హిందీలో సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తోన్న ‘మిషన్‌ మజ్ను’తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ చిత్రంలో నటిస్తోంది.