ముంబై : 101/3 (15 ఓవర్లు)

చెపాక్‌ స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ముంబయి ఇండియన్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (32, 25 బంతుల్లో 2ఫోర్స్, 2 సిక్స్ లు), డికాక్ (40, 39 బంతుల్లో 5ఫోర్స్) దాటిగా ఆడారు. అయితే ఈ జంటని విజయ్ శంకర్ విడదీశాడు. రోహిత్ ని అవుట్ చేశాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే సూర్య కుమార్ యాదవ్ (10) ని కూడా విజయ్ శంకర్ అవుట్ చేశాడు. ఇక డికాక్ ని మజీర్ ఉర్ రెహ్మాన్ అవుట్ చేశాడు. ముంబై 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 101 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషాన్ 9, పోలార్డ్ 2 ఉన్నారు.