RCB హ్యాట్రిక్ విన్

ఐపీఎల్ లో బెంగళూరు విజయ యాత్ర కొనసాగుతోంది. ఆదివారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో గెలుపొంది హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

 విరాట్‌ కోహ్లీ(5), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ రజత్‌ పాటిదార్‌(1) త్వరగా అవుటైనా.. మాక్స్‌వెల్‌(78; 49 బంతుల్లో 9×4, 3×6), డివిలియర్స్‌(76; 34 బంతుల్లో 9×4,3×6) దంచికొట్టారు. చివరి మూడు ఓవర్లలో డివిలియర్స్‌ విధ్వంసం సృష్టించాడు. కైల్‌ జేమీసన్(11)తో కలిసి 18 బంతుల్లో 56 పరుగులు సాధించాడు.

205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 20 ఓవర్లలో 166/8కే పరిమితమైంది. రసెల్‌(31; 20 బంతుల్లో 3×4, 2×6), కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌(29; 23 బంతుల్లో 1×4, 2×6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.  ఆర్సీబీ బౌలర్లలో జేమీసన్‌ మూడు, చాహల్‌ రెండు, హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లు తీశారు.