తగ్గేదే లే.. యాక్షన్ సీన్ కోసం రూ.40కోట్లు !

తగ్గేదే లే.. అంటూ బరిలోకి దిగిపోయారు స్టయిలీష్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన తాజా చిత్రం ‘పుష్ప’. బన్నీ-సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. దీంతో.. పుష్పపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఐతే ఇటీవలే వచ్చిన పుష్ప టీజర్ అంచనాలని మించేలా ఉంది. బన్నీ చేస్తున్నతొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ నేపథ్యంలో ఖర్చు విషయంలో ఏమాత్రం తగ్గడం లేదట. కేవలం యాక్షన్‌ సన్నివేశాల కోసమే రూ.40కోట్లు ఖర్చు పెడుతున్నారట.

ఈ సినిమాలో బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో బన్ని ఎర్ర చందనం స్మగ్లర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 13న పుష్ప ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో.. పుష్ప కరెక్ట్ డేటుకు రావడం అనుమానమే అంటున్నారు. ఇక పుష్ప తర్వాత బన్నీ ఐకాన్ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. దిల్ రాజు నిర్మించనున్నారు.