ఎన్టీఆర్ షో.. జనాలు రావడం లేదా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 సూపర్ హిట్ అయింది. యంగ్ టైగర్ ఎన్ టీఆర్ తెలుగు బిగ్ బాస్ ని ఓ రేంజ్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. తారక్ సెట్ చేసిన ఆ రేంజ్ ని మించేలా కానున్నా.. తగ్గకుండా మిగితా సీజన్లు సాగాయి. అయితే మరోసారి తారక్ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహారించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మేరకు బిగ్ బాస్ యాజమాన్యం చేసిన గట్టి ప్రయత్నాలు ఫలించలేదని సమాచారమ్. 

బిగ్ బాస్ ని నో చెబుతున్న తారక్.. అనూహ్యంగా ‘ఎవరు మీలో కోటిశ్వరులు’ షోకి ఓకే చెప్పేశారు. ఈ ప్రోగ్రామ్ ప్రెస్ మీట్ లో పాల్గొని.. షో ఫార్మెట్ గురించి కూడా వివరించారు తారక్. అయితే ఇప్పుడీ.. ఈ షోపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడిందని తెలుస్తోంది.  ఇది వ‌ర‌కు ఇలాంటి షోలలో పాల్గొన‌డానికి చాలామంది పోటీ ప‌డేవారు. ల‌క్ష‌లాది అప్లికేష‌న్లు వ‌చ్చేవి. వాటిని స్కూట్నీ చేసి, అభ్య‌ర్థుల్ని పిలిపించి, ఇంట‌ర్వ్యూలు చేసి, అప్పుడు సెలెక్ట్ చేసేవాళ్లు. ల‌క్ష‌ల్లో ఉండే అప్లికేష‌న్లు ఇప్పుడు వంద‌ల్లోకి త‌గ్గిపోయాయట. ఎన్టీఆర్ షోకి ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశా.. ఎవరు ఊహించి ఉండకపోవచ్చు.