గబ్బర్ గర్జన.. ఢిల్లీ ఈజీ విన్ !

గబ్బర్ శిఖర్ ధావన్ గర్జిస్తే.. ఇక అంతే. విజయం ఖాయం. ధావన్ భారీ స్కోర్ చేసిన అత్యధిక సార్లు టీమిండియా గెలిచింది. ఇప్పుడు ఐపీఎల్ లోనూ అంతే. గబ్బర్ ఆడితే ఢిల్లీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లోధావన్‌(92; 49 బంతుల్లో 13×4 2×6) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో..196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది.

టాస్‌ మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (61; 51 బంతుల్లో 7×4, 2×6), మయాంక్‌ అగర్వాల్ (69; 36 బంతుల్లో 7×4, 4×6) ధాటిగా ఆడారు. క్రిస్‌గేల్‌ 11, నికోలస్‌ పూరన్ ‌9, దీపక్‌ హుడా 22, షారుఖ్‌ఖాన్‌ 15 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్‌వోక్స్‌, రబాడా, అవేశ్‌ఖాన్‌, మెరివాలా చెరో ఓ వికెట్‌ పడగొట్టారు.

ఇక 196 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు ధావన్ 92, పృథ్వీషా (32; 17 బంతుల్లో 3×4, 2×6) చెలరోగడంతో భారీ లక్ష్యం చిన్నదైపోయింది.స్టీవ్‌స్మిత్‌(9), రిషభ్‌ పంత్‌(15) తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యారు. ఐతే, ఆఖరుల్లో స్టోయినిస్‌(27; 13 బంతుల్లో 3×4, 1×6), లలిత్‌(1; 6 బంతుల్లో 2×4) పని పూర్తి చేశారు. పంజాబ్‌ బౌలర్లలో రిచర్డ్‌సన్‌ రెండు వికెట్లు తీయగా అర్ష్‌దీప్‌, మెరిడిత్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.