పవన్’కు వివేకానందుడు, చెగోవేరా.. పరామర్శ !

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందారు. అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అభిమానులు మాత్రమే కాదు.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, పవన్ ని వ్యక్తిగతంగా ఇష్టపడే చాలా మంది ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఓ అభిమాని.. ఓ బొమ్మ గీశాడు. ప‌వన్ బెడ్ మీద ప‌డుకుంటే.. వివేకానందుడు, చెగోవేరా ప‌వ‌న్‌ ని ప‌రామ‌ర్శిస్తున్న‌ట్టు గీసిన ఫోటో అది.  ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిపై హేతువాది బాబు గోగినేని సటైర్లు వేసిన సంగతి తెలిసిందే. “39 ఏళ్ల‌కే చ‌నిపోయిన వివేకానందుడు, అదే వ‌య‌సులో చంప‌బ‌డ్డ డాక్ట‌ర్ చే.. ఇద్ద‌రూ రిస్క్ తీసుకుని మాస్క్ పెట్టుకోకుండా వ‌స్తే, అభిమానుల కోసం చ‌క్క‌గా త‌ల దువ్వుకుని న‌ల‌గ‌ని లుంగీలో డ్రెస్ అయ్యి, సెలైన్ ఎక్కించుకుంటున్న 49 ఏండ్ల యువ హీరోని ప‌రామ‌ర్శించ‌డం చాలా స్ఫూర్తి దాయ‌కం..” అంటూ కామెంట్ చేశారు. 

వీటిని భరించలేని మెగా బ్రదర్ నాగబాబు.. బాబు గోగినేని టార్గెట్ చేశారు. ‘నేను పెంపుడు కుక్కలను మాత్రమే ఇష్టపడతా. తమ కుటుంబంలోని వ్యక్తుల పై అవాకులు చవాకులు మాట్లాడే వారు ఊర కుక్కలు’ అని అర్థం వచ్చేలా నాగబాబు కామెంట్ చేశారు. నాగబాబు వ్యాఖ్యలపై బాబు గోగినేని కౌంటర్ ఇచ్చారు. గాంధీజీ హంతకుని, దేశభక్తుడు అన్న దుష్టుడు నాగబాబు. ఇలాంటి వారి చుట్టూ పెంపుడు కుక్కలు మాత్రమే ఉంటాయి.. మనుషులు కాదు అన్నారు బాబు గోగినేని. మొత్తానికి.. వివేకానందుడు, చేగువేరాలు పవన్ ని పరామర్శించిన వివాదానికి.. ఇప్పట్లో తెరపడటం లేదు. ఇది చిరిగి చిరిగి గాలి వానల మరేలా ఉంది.