తెలుగు సినిమాని 267 సార్లు చూసిన బాలీవుడ్ హీరోయిన్ !

అభిమాన హీరో, హీరోయిన్ సినిమా వచ్చిందంటే.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆశపడతారు. కాస్త కష్టమైనా చూసేస్తారు. ఆ తర్వాత కూడా మరో మూడ్నాలుగు సార్లు చూసేస్తారు. అది అభిమానం. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి అభిమానులైతే.. ఓ ఇరవై, ముప్పై సార్లు చూసేస్తారు. కుదిరితే ఒక్కరోజే వరుసగా మూడ్నాలుగు షోస్ చూస్తారు. చూసిన వాళ్లు ఉన్నారు. కానీ ఓకే సినిమాని ఏకంగా 267 సార్లు చూడడం అంటే.. రికార్డే. ఈ రికార్డునే కొట్టేసింది బాలీవుడ్ హీరోయిన్ శ్రేయా ధ‌న్వంత‌రి.
ఆమె ‘క్షణంక్షణం’ సినిమాని 267 సార్లు చూసిందట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

అన్నట్టు శ్రేయా ధ‌న్వంత‌రి తెలుగమ్మాయినే. బాలీవుడ్ లో రాణిస్తోంది.జోష‌త్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రేయా ధ‌న్వంత‌రి, ఆ త‌ర్వాత ది ఫ్యామిలీ మ్యాన్‌, స్కామ్ 1992 వెబ్ సిరీస్‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగానే ఉన్నారు. ఐతే తాను బాలీవుడ్ లో రాణిస్తున్నా.. తనకు తెలుగు సినిమాలే ఇష్టమని చెబుతోంది.. ఈ బ్యూటీ. బహుశా.. తన అందాలని రామ్ గోపాల్ వర్మ కెమెరా యాంగిల్స్ తో చూసుకోవాలని కోరుకుంటున్నట్టుంది. వర్మ కెమెరా అందాలని చూపిస్తే.. ఆ తర్వాత చూపించుకోవడానికి ఏమీ ఉండదని ధన్వంతరికీ తెలియన్నట్టుంది.

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ‘క్షణక్షణం’ చిత్రంలో వెంకటేష్-శ్రీదేవి జంటగా నటించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించారు. 1991 వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ టీవీల్లో వచ్చినా. మంచి టీఆర్పీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటుంది.