బ్రేకింగ్ : ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 8,987 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 35 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,76,987కి చేరింది. మరణాల సంఖ్య 7,472కి చేరింది.

ఒక్కరోజులో 3,116 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 53,889 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరు జిల్లాలో 1,347, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 99 మందికి వైరస్‌ సోకింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 8 మంది మరణించగా.. చిత్తూరు, కడప జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి.. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చనిపోయారు. తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు.