సీఈసీ సుశీల్ చంద్రకు కరోనా పాజిటివ్

దేశంలో ఉదృతి కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు మాత్రమే ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సుశీల్‌ చంద్ర కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు కూడా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

సుశీల్‌ చంద్ర వారం రోజుల క్రితమే సీఈసీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గత సోమవారం సునీల్‌ అరోడా పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కేంద్రం సుశీల్‌ను నియమించింది. ముగ్గురు సభ్యులుండే కేంద్ర ఎన్నికల సంఘంలో అరోడా పదవీ విరమణతో సుశీల్‌ చంద్ర, రాజీవ్‌ కుమార్‌ ఇద్దరే ఉన్నారు. వీరిద్దరికీ వైరస్‌ సోకినట్లు ఈసీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్టు తెలిపారు.