WTC Final ఉంటుంది : ఐసీసీ

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు భారత్ ని బ్లాక్ లిస్టులో పెట్టేస్తున్నాయ్. ఇప్పటికే యూకే భారత్ ని బ్లాక్ లిస్టులో పెడుతూ నిర్ణయం తీసుకొంది. ఇదే దారిలో ఇతర దేశాలు ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారమ్. ఇలాంటి నేపథ్యంలోనూ.. టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరగాల్సిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC) యథావిధిగా జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించాలని ఇదివరకే ఐసీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ‘కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్‌లో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ఎలా నిర్వహించాలనేదానిపై ఈసీబీ, ఇతర అధికారులు మాకు వివరించారు. దాంతో అనుకున్న తేదీలోనే యథావిధిగా మ్యాచ్‌ను నిర్వహిస్తామనే నమ్మకంతో ఉన్నాం. అలాగే ప్రయాణ ఆంక్షలు విధించిన దేశాల పరిస్థితులపై ఇంగ్లాండ్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.