ధోని తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంట్లో కరోనా కలవరం మొదలైంది. ధోనీ తల్లి దేవకి దేవి, తండ్రి పాన్‌సింగ్‌ కొవిడ్‌ బారినపడ్డారు. ప్రస్తుతం వీరు రాంచీలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ధోని ఐపీఎల్ 2021లో ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా వ్యవహిరిస్తున్నారు. గత మ్యాచ్ లో చెన్నై రాజస్థాన్ పై భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని వాంఖడే మైదానంలో బుధవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇక కరోనా బారినపడిన ధోని తల్లిదండ్రులకు.. ఆయన కుటుంబ సభ్యులు అండగా ఉన్నట్టు తెలిసింది.