TSలో 5.567కేసులు, 23 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5,567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 23 మంది మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,251 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 49,781 యాక్టివ్‌ కేసుల ఉన్నాయి.

మరోవైపు కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. ఇదీగాక, ఆసుపత్రుల్లో అన్నీ వసతులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మందులు, ఆక్సిజన్ నిల్వలు ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. నైట్ కర్ఫ్యూతోనే పరిస్థితి అదుపులోనికి రావాలని.. లాక్ డౌన్ వరకు వెళ్లకూడదనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.