కరోనాతో సీతారం ఏచూరి కొడుకు మృతి

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. సామాన్యులే కాదు. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు మహమ్మారి బారినపడుతున్నారు. వీరిలో కొందరు కరోనాతో పోరాటంలో ఓడిపోతున్నారు కూడా. తాజాగా సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్ద కుమారుడైన ఆశిష్‌ ఏచూరి కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని సీతారాం స్వయంగా ట్విటర్‌ వేదికగా ధ్రువీకరించారు.

‘ఈ విషయం తెలియజేయడానికి ఎంతో బాధగా ఉంది. కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడి నా పెద్ద కొడుకు ఆశిష్‌ ఈ ఉదయం మృతి చెందారు. మా కుమారుడిని బతికించేందుకు శ్రమించి చికిత్స అందించిన వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి, ఈ ఆపత్కాలంలో మాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ఏచూరి ట్వీట్‌లో పేర్కొన్నారు.