సోనుసూద్ అభిమానులకు గుడ్ న్యూస్

బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనుసూద్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనా నుంచి సోనుసూద్ కోలుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోనుసూద్  ట్విట్ చేశారు. మొహానికి మాస్క్ పెట్టుకొని విక్టరీ సింబల్ తో ఉన్న తన పిక్ ని షేర్ చేశాడు. ఈ పిక్ పై నెగటివ్ అని రాసి ఉంది. దీంతో ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు.

కొన్నాళ్లుగా సోనూసూద్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆయన సైకిల్ మీద వెళ్లిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే సోనుసూద్ కి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆచార్య టీమ్ అప్రమత్తం అయింది. షూటింగ్ ని తాత్కాఌకంగా వాయిదా వేసి.. చిత్రబృందం క్వారంటైన్ లోకి వెళ్లినట్టు తెలిసింది.

ఇక దేశంలో కరోనా విజృంభిస్తున్న టైమ్ లో సోనుసూద్ కనిపించే దేవుడిగా మారాడు. పేదల ఆకలి తీర్చాడు. సొంత ఖర్చులతో వలస కూలీలని సొంత గ్రామాలకు చేర్చారు. ఇందుకోసం బస్సులు, రైళ్లు, విమానాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక కరోనా టైమ్ లో చనిపోయిన వసలకూలీల కుటుంబాలని కూడా ఆయన ఆదుకున్నారు. తనవంతు ఆర్థిక సాయం చేశారు. దీంతో.. సోనుసూద్ రియల్ హీరో అంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఆయన మంచి మనసుని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా అభినందించింది.

Tested: COVID-19 Negative. pic.twitter.com/wF61zXVJ6m— sonu sood (@SonuSood) April 23, 2021