భాగ్యనగర్’లో హనుమాన్ శోభాయాత్ర రద్దు

ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఐతే ఈసారి కరోనా ఎఫెక్ట్ తో శోభయాత్రని రద్దు చేశారు. ఈ మేరకు భజరంగ్ దళ్ నిర్వహకులు ఓ ప్రకటన చేశారు. నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

 హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్రకు రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ మందిర్ వరకు సాగే ఈ శోభయాత్రలో 21 మంది మించకూడదని, ర్యాలీలో బైక్‌ల మీద ఒకరి కంటే ఎక్కువ వెళ్లకూడదు. అలాగే కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఐతే యాత్రలో పాల్గొనేందుకు ఊహించని స్థాయిలో భక్తులు రావడంతో శోభాయాత్రను రద్దు చేస్తున్నట్టు నిర్వహకులు ప్రకటించారు.