నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓటమి

దీదీ పంతం నెగ్గించుకున్నారు. హ్యాట్రిక్ కొట్టారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం ఖాయమైంది. దాదాపు 216 స్థానాల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేయబోతుంది. ఇప్పటికే 207 స్థానాల్లో గెలిచేసింది. మరో  9 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక దీదీకి ఈసారి చెక్ పెట్టాలని గట్టి ప్రయత్నించిన భాజాపాకు నిరాశే ఎదురైంది. ఆ పార్టీ 74 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంతటి భారీ విజయం మధ్య తృణమూల్ శ్రేణుల్లో ఓ నిరాశ. నందిగ్రామ్ లో మమమత బెనర్జి ఓడిపోయారు.

ఆదినుంచి ఉత్కంఠరేపిన నందిగ్రామ్‌లో భాజపా అభ్యర్థి సువేందు అధికారి విజయం సాధించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 1736 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో చివరకు భాజపా నేత సువేందు అధికారి విజయం సాధించారు.