పుష్ప.. తెగ్గొట్టేశాడా ?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అదే ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారట. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాల్సిన అవసరం ఉందని సుకుమార్‌ భావించారట. అదే విషయాన్ని బన్నీతో చెప్పగా ఆయన కూడా ఓకే అన్నారట. దీంతో దేశంలో పరిస్థితులు కుదుటపడి, అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాదిలో ‘పుష్ప’ మొదటి భాగాన్ని విడుదల చేస్తారట. 

అలాగే వచ్చే ఏడాదిలో రెండో భాగాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సుకుమార్‌-బన్నీ-దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో రానున్న మూడో చిత్రమిది. రష్మిక కథానాయిక. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘పుష్పరాజ్‌’ ఇంట్రో వీడియో అందర్నీ ఆకర్షించింది. ఇందులో తగ్గేదేలే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.