APలో 96.. TSలో 38 మంది మృతి !

తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో 20,065మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివిటీ రేటు 19.75శాతం ఉండగా, అత్యధికంగా 96మంది మృతి చెందినట్లు వెల్లడించారు. పశ్చిమగోదావరిలో 14మంది చనిపోగా, విశాఖలో 12మంది మృత్యువాతపడ్డారు.

ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 4,92,385 కేసులు నమోదయ్యాయ్. తాజాగా మహమ్మారి కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 2,704కి పెరిగింది. ఇవాళ 7,994 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో 68,462 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 904 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.