న్యాయవాది దంపతుల హత్య కేసులో కీలక పరిణామం

హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి మధును ఏపీలో భీమవరంలో పట్టుకున్నట్లు రామగుండం కమిషనరేట్‌ ప్రకటించింది.

ఈ కేసు విచారణలో భాగంగా పుట్ట మధు సతీమణి శైలజ సహా మరికొందరికి పోలీసులు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.  శైలజను పోలీసులు విచారణకు పిలిచారు. ఆమెతో పాటు కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సత్యనారాయణ, వామన్‌రావు తండ్రి కిషన్‌రావును విచారణకు హాజరుకావాలని కోరారు.