అస్సాం సీఎం అభ్యర్థిగా బిశ్వశర్మ

అస్సాం సీఎం అభ్యర్థిగా.. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మను భాజపా అధిష్ఠానం సీఎం అభ్యర్థిగా ఖరారు చేసింది. సీఎం అభ్యర్థి ఎంపికపై భాజపా అధిష్ఠానం పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. ప్రస్తుత సీఎం శర్బానంద సోనోవాల్‌, హిమంత బిశ్వశర్మ పట్టుబట్టడంతో ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కనుందనేదానిపై ఉత్కంఠ కొనసాగింది. ఐతే పలు దఫాలుగా చర్చలు అనంతరం భాజాపా అధిష్టానం హిమంత బిశ్వశర్మను అస్సాం సీఎం అభ్యర్థిగా ఫైనల్ చేసింది.

ఇప్పటికే గువహటిలో అస్సాం భాజపా శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా హిమంతను ఎన్నుకోనున్నారు. త్వరలో సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు.