సీఎంకు కరోనా పాజిటివ్‌

కరోనా ఎవ్వరినీ వదలడం లేడు. మంత్రులు, ముఖ్యమంత్రులు, దేశాధినేతలు కరోనా బారినపడుతున్నరు. ఒక్క ఏపీ సీఎం జగన్ తప్ప దాదాపు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారినపడ్డారు. కోలుకున్నారు. ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దాన్ని నుంచి కోలుకున్న తర్వాత.. రాష్ట్రంలో కరోనా కట్టడిపై దృష్టి సారించారు. తాజాగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి కరోనా బారిన పడ్డారు. 

సీఎంగా ప్రమాణం చేసిన నాలుగు రోజులకు ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ వైద్యకళాశాలలో రంగస్వామికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చికిత్స కోసం ఆయన చెన్నై వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 7న సీఎంగా రంగస్వామి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.