తారక్ త్వరగా కోలుకోవాలి : చంద్రబాబు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తారక్ త్వరగా కోలుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తగు జాగ్రత్తలు తీసుకొని కొవిడ్‌ను త్వరగా జయించి రావాలన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు.

తనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఎన్టీఆర్‌ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ”తాజాగా చేసిన పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాం. ఇటీవల నన్ను కలిసిన వారందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా”అంటూ తారక్ ట్విట్ చేశారు.