టీమిండియా కోచ్ గా రాహుల్‌ ద్రవిడ్‌ !

టీమిండియాకు  రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌, ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌ కోసం సెలక్టర్లు 20 మందితో జంబో జట్టును ప్రకటించారు. ఇదే సమయంలో భారత మరో జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. 

పరిమిత ఓవర్ల క్రికెట్‌ స్పెషలిస్టులే ఇందులో ఉంటారు. ఈ నేపథ్యంలో శ్రీలంకలో పర్యటించే జట్టుకు ఎవరు కోచ్‌గా ఉంటారన్న సందేహాలు కలిగాయి. అండర్‌-19, భారత్‌-ఏ జట్లకు కోచ్‌గా విజయవంతమైన రాహుల్‌ ద్రవిడ్‌ను లంకకు పంపిస్తారని సమాచారం.