అలర్ట్ : బ్యాంక్ పనివేళల్లో మార్పులు

తెలంగాణలో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు పనివేళల్లో మార్పులు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈనెల 20వ తేదీ వరకూ ఇది అమలులో ఉండనుంది. అదే విధంగా 50శాతం సిబ్బందితో మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.

మరోవైపు లాక్‌డౌన్‌ ని కఠినంగా అమలు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత 20 గంటలు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు.