రెండు సినిమాలని ఖరారు చేసిన తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్ లో ఉన్నారు. తాజాగా తారక్ ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తిరమైన విషయాలు పంచుకున్నారు. రాజమౌళికి జక్కన్న అనే పేరు పెట్టింది తానే అన్నారు. తన తర్వాతి సినిమా కొరటాల శివతో చేస్తున్నానని ఖరారు చేశారు.

గతంలో ‘జనతా గ్యారేజ్‌’ చేశామని.. అది పెద్ద బ్లాక్‌బస్టర్‌హిట్‌ అయిందని గుర్తు చేశారు. ఆర్ఆర్‌ఆర్‌ పూర్తవగానే ఆ సినిమా మొదలు పెడతామన్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్‌ నడుస్తుందన్నారు. కొరటాలతో సినిమా అనంతరం ప్రశాంత్‌నీల్‌తో మరో సినిమా చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ తర్వాత తారక్ చేయబోయే రెండు సినిమాలని ఖరారు చేసినట్టయింది.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ తారక్ కొమరంభీమ్ గా కనిపించనున్నారు. ఆయనకు జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌’లో దాదాపు మెజార్టీ భాగం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వల్ల నెలల పాటు వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ ఓటీటీలో రిలీజ్ చేసే ప్రస్తక్తే లేదు. ఇది థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అని తారక్ అభిప్రాయపడ్డారు.