రుయా మృతులు 11 కాదు 23

తిరుపతి రియా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఘటనలో 11 మంది కాదు 23 మంది చనిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మొత్తం 23 మంది చనిపోయారంటూ వారి పేర్లతో సహా వివరాలు తెలిపారు.

మృతులను కె.బాలు, జయచంద్ర, రామారావు, రమేశ్‌ బాబు, భువనేశ్వరి బాబు, కలందర్‌, రమణాచారి, ప్రభాకర్‌, మహేంద్ర, షాహిద్‌, గజేంద్రబాబు, పుష్పలత, మహమ్మద్‌ పాషా, వేణుగోపాల్‌, గౌడ్‌ భాషా, రాజమ్మ, మదన్మోహన్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి, సుబ్రమణ్యం, బి.సులోచన, తనుజరాణి, పజులాల్‌, వెంకట సుబ్బయ్యగా వెల్లడించారు.