2022 వరకు థియేటర్స్ బంద్ ?

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మరోసారి అధికారికంగా మూతపడ్డాయి. ఐతే ఈ సారి తిరిగి తెరచుకోవడం బాగా ఆలస్యం కానుందని సమాచారమ్. మొదటి దశ తరువాత తొందరపడి థియేటర్లు తెరిచామని, రెండో దశ తరువాత అలా చేయకూడదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది.

రెండో దశ ముగిసిన తరువాత థియేటర్లు తెరుచుకున్నా యాభై శాతంతోనే తెరుచుకుంటాయి. అంతే కాదు.. వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం జరిగే వరకు ఆంధ్ర లో థియేటర్లకు ఇవ్వరని సమాచారమ్. ఇక తెలంగాణలోనూ ఈ సారి థియేటర్స్ విషయంలో తొందరపడరని తెలిసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ పూర్తిస్థాయిలో మళ్లీ తెరచుకొనేది 2022లో అని చెబుతున్నారు. బహుశా.. వచ్చే యేడాది సంక్రాంతి వరకు అంతా మాములు అయిపోవచ్చు.