పూరికి అక్కతో పాటు అత్తనవుతా!

న‌టి హేమ‌ గురించి తెలిసిందే. ఓపెన్ గా మాట్లాడేస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పూరికి నేను అక్కతో పాటు అత్తనవుతానని చెప్పుకొచ్చారు. అదెలా అంటే ? 

“తాను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఉన్న సమయంలోనే పూరి జగన్నాథ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌. సింగిల్‌ ఎపిసోడ్స్‌కు డైరెక్ష‌న్ చేసేవారు. అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది.  అప్పట్నుంచి బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌లా ఉండేవాళ్లం. అతడు మా ఫ్యామిలీకి క్లోజ్‌. ఎంతలా అంటే.. అతను ఉంటేనే నన్ను షూటింగ్స్‌కు పంపేవారు. ఒంటరిగా వెళ్లనిచ్చేవారు కాదు. 

ఎప్పుడైనా డబ్బు అవసరం అయితే నన్నే అడిగివాడు. మా ఆయనకు తెలియకుండా పూరికి డబ్బులిచ్చేదాన్ని. ఐదందలు, వెయ్యి ఇలా పోపు డబ్బాల్లో దాచుకొని ఇచ్చేదాన్ని.  పూరి పెళ్లి దగ్గరుండి చేశాం. పెద్దవాళ్లెవరూ లేకపోతే భర్తతో కలిసి కాళ్లు కడిగి కన్యాదానం చేశా. అలా పూరి జగన్నాథ్‌కి నేను అక్కతో పాటు అత్తనవుతాను’ అని హేమ చెప్పుకొచ్చారు.