బుచ్చితో తారక్.. ఇంకా క‌మిట్ కాలే !

 ‘ఉప్పెన‌’తో ఒక్క‌సారి అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు బుచ్చిబాబు. ఈ సినిమా హిట్ క్రెడెట్ 90% దేవిశ్రీ ప్రసాద్ దే అయినా.. వందశాతం బుచ్చిబాబు ఖాతాలో వేశారు. ఇక త‌న త‌దుప‌రి సినిమా ఎన్టీఆర్ తోనే అని టాలీవుడ్ టాక్‌. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. ఐతే ఈ ప్రాజెక్ట్ పై తారక్ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తారక్.. తన తదుపరి రెండు సినిమాలని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ సినిమా ఉంటుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా అని చెప్పేశారు. 

కానీ బుచ్చిబాబు సినిమా గురించి తారక్ ఏమీ చెప్పలేదు. అసలు చర్చలు సాగాయని కూడా అనలేదు. కొర‌టాల శివ కీ. ప్ర‌శాంత్ నీల్ కీ మ‌ధ్య ఏదైనా గ్యాప్ వ‌స్తే, అప్పుడు…. బుచ్చితో క‌మిట్ అవుదామ‌నుకుంటున్నాడు ఎన్టీఆర్‌. అయితే అంత గ్యాప్ వ‌స్తుందో, లేదో చెప్పడం క‌ష్టం. అందుకే బుచ్చిబాబు ప్రాజెక్ట్ విష‌యంలో ఎలాంటి క‌మిట్మెంటూ ఇవ్వ‌లేక‌పోతున్నాడని సమాచారమ్. తారక్ తో బుచ్చికు మంచి అనుబంధం ఉంది. నాన్నకు ప్రేమతో సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అప్పటి నుంచి తారక్ తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. తారక్ తో సినిమా చేయడమే బుచ్చి లక్ష్యం. అది రెండో సినిమాతోనే తీర్చుకోవాలనుకుంటున్నారు.